వనస్థలిపురం : నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ సాగర్ కాంప్లెక్స్ ఫేజ్1 కాలనీలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను శనివారం శంకుస్థాపన చేశారు.
రూ.79కోట్లతో నిర్మించనున్న పనులను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
నాణ్యతాలోపాలు లేకుండా పనులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ దరి, త్రినేత్ర హనుమాన్ టెంపుల్ చైర్మన్ కొత్త శ్రీధర్గౌడ్, సుమన్గౌడ్, మాధవరం నర్సింహ్మారావు, నాయకులు మెట్టుపల్లి సంతోష్రెడ్డి, రాజిరెడ్డి, పద్మారెడ్డి, మహేందర్రెడ్డి, విష్ణువర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.