కందుకూరు : బాలల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం బాటలు వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురష్కరించుకొని ఆదివారం బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మంత్రి నివాసంలో చిన్నారి బాలబాలికలతో కలిసి బాలల దినోత్పవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
చైల్డ్ లైన్ పోస్టరును మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. నెహ్రూ వేషాధారణలో ఉన్న పిల్లలతో ఆనందాన్ని పంచు కున్నారు. వారికి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, నేటి బాలలు రేపటి పౌరులని చెప్పారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులతో గడపడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రతి ఒక్కరికి బాల్యం తీపిగుర్తులను ఇస్తుందని వివరించారు.అంతే కాకుండా బాలల దినోత్సవం ఎంతో ఉత్తేజాన్ని నింపుతుందని తెలిపారు.ఎప్పటికి మరిచిపోని మధుర స్మృతులు అందిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యకు ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పాల్గొన్నారు.