నర్వ, జనవరి 5: రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి, బెక్కర్పల్లిలో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రైతులను అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రైతుబంధు, ఉచిత కరెంటు, రైతుబీమా, విత్తనాలు, ఎరువుల పంపిణీ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గిట్టుబాటు ధర వంటి ఎన్నో పథకాలను రూపొందించిందన్నారు. గతంలో వలస కార్మికులుగా పనిచేసిన రైతులు ప్రస్తుతం యజమానులుగా మారారన్నారు. రైతులకు ఏ విధమైన సహాయ, సహకారాలు అవసరమైనా తాను సిద్ధంగా ఉంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మండ్ల చిన్నయ్య, సర్పంచులు ఇందిరమ్మ, గౌరమ్మ, నాయకులు శంకర్, రవి, వ్యవసాయ అధికారులు మహేశ్, వెంకట్రాములుగౌడ్ పాల్గొన్నారు.
రైతుబంధు సంబురాలు
దామరగిద్ద, జనవరి 5: మండలంలోని పలు గ్రామాల్లో రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు రైతుబంధు ఆకారంలో కూర్చున్నారు. కార్యక్రమంలో ఎస్వో పావని, ఉపాధ్యాయురాళ్లు కవిత, రజిత, వరలక్ష్మి, శ్రీప్రియ తదితరులు పాల్గొన్నారు.
గుడెబల్లూర్లో..
కృష్ణ, జనవరి 5: మండలంలోని గుడెబల్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఏఈవో అభిలాష్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ మహాదేవమ్మ హాజరై మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టిబడి ఇచ్చి రాజులుగా చేస్తున్నది సీఎం కేసీఆర్ అని అన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యులు శంకరప్ప, గ్రామ కోఆర్డినేటర్ వెంకటేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రైతులకు సన్మానం
నారాయణపేట టౌన్, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం బలోపేతానికి కృషి చేస్తున్నదని పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కరకుమారి అన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతులను పూలమాల, శాలువాతో సన్మానించారు. టీఆర్ఎస్ అన్నదాతకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కన్న జగదీశ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్, సూపర్వైజర్ లక్ష్మన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బీడు సాగులోకి.. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
ధన్వాడ, జనవరి 5: రైతుబంధు పథకంతో బీడుబారిన పొలాలు సైతం సాగులోకి వచ్చాయని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. ధన్వాడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు సంతోషంగా పంటలను పండిస్తున్నారన్నారు. రైతులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జైకిసాన్..జై కేసీఆర్ అంటూ నినదించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, సర్పంచ్ చిట్టెం అమరేందర్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి ప్రదీప్కుమార్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసులు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సునీల్రెడ్డి, ఉపాధ్యక్షుడు సచిన్ పాల్గొన్నారు.