రామన్నపేట, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా రామన్నపేటలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రామన్నపేటలో బీజేపీకి చావు డప్పు మోగించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. సుభాశ్సెంటర్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, నాయకులు పున్న జగన్మోహన్, అంతటి రమేశ్, గుత్తా నర్సింహారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, యాదిరెడ్డి, ప్రకాశ్ పాల్గొన్నారు.
కేంద్రాన్ని వదిలేది లేదు
చౌటుప్పల్ : తెలంగాణ ప్రాంత రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వదిలేది లేదని జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చౌటుప్పల్లో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో వారు పాల్గొని మాట్లాడారు. అంతకుముందు జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేన్రెడ్డి రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాల ప్రభాకర్రెడ్డి, వెంకటేశ్ యాదవ్, పిల్లలమర్రి శ్రీని వాస్, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
సంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మడలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీ గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జక్కిడి యాదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
అడ్డగూడూరులో బైక్ ర్యాలీ
అడ్డగూడూరు : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మందుల సామేల్, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యుడు గుండిగ జోసెఫ్, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, నాయకులు చిప్పలపల్లి మహేంద్రనాథ్, మాదాను ఆంథోని, బాలెంల త్రివేణి, నాగులపల్లి దేవగిరి పాల్గొన్నారు.
పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాల్సిందే
మోత్కూరు, డిసెంబర్ 20 : రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మోత్కూరులో సోమవారం రైతులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు పాడె కట్టి శవయాత్ర నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, ఎంపీపీ బుషిపాక లక్ష్మి, మేఘారెడ్డి, కొండ సోంమల్లు, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.