మెహిదీపట్నంః చారిత్రాత్మక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల ఎనిమిదో పూజ గురువారం ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రజల సహాయసహకారాలతో గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ట్రస్టు కమిటీ ఛైర్మన్ కోయల్ కార్ గోవింద్రాజ్,ఆలయ ఈవో మహేందర్కుమార్లు తెలిపారు.