జూబ్లీహిల్స్ : ప్రతి ఇంట్లో అందరూ కరోనా టీకా వేసుకుని కొవిడ్ మహమ్మరిని తరిమికొట్టాలని.. ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసులు టీకాలు వేసుకుని కరోనాపై వందశాతం విజయం సాధించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పిలుపునిచ్చారు.
ఆరోగ్యకర సమాజం కోసం అందరూ కరోనా టీకాలు వేసుకోవాలని, కుటుంబంలో ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోకున్నా భవిష్యత్లో కుటుంబ సభ్యులందరికీ ప్రమాదమేనని పేర్కొన్నారు. సోమవారం యూసుఫ్గూడ స్రవంతినగర్, వెంకటగిరి పీజేఆర్ కమ్యునిటీ హాల్లలో మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్పై అలసత్వం వహిస్తే కుటుంబానికి.. సమాజానికి కీడు చేసిన వారిగా మిగిలిపోతారన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యాక్సిన్ కేంద్రాల వివరాలను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేష్ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వ్యాక్సిన్ వేసుకున్న లబ్ధిదారులతో మాట్లాడి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందు భార్గవి తదితరులు పాల్గొన్నారు.