మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ పేదలకు వరంలాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.అమీర్పేట్ గ్రామానికి చెందిన డప్పు వినయ్కుమార్కు ఆరోగ్యం బాగలేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. అతనికి సీఎం రిలీఫ్ఫండ్నుండి 4లక్షల రూపాయలను మంజూరు చేశారు.
అట్టి చెక్కును నగరంలో మంత్రి నివాసంలో మంత్రి చేతులమీదుగా ఆయనకు అందజేశారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసి ఆదుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని ఆమె అన్నారు.
ఈకార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పోతుల నర్సింగ్పటేల్ గ్రామశాఖ అద్యక్షులు పెంటల వెంకటేష్ కోఆప్షన్ సభ్యులు ఆవుల అశోక్ నాయకులు మంత్రి రాజేష్, జాన్రెడ్డి పాల్గొన్నారు.