కందుకూరు : ఇంటి ఆవరణలో ఉన్న నీటి బకెట్లో పడి చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అండేకార్, శ్రీనివాస్ జీ దంపతులు తన తల్లి తండ్రులతో కలిసి మండల కేంద్రంలో నివాసం ఉంటూ మటన్ వ్యాపారం చేసుకుంటు జీవిస్తున్నారు.
శ్రీనివాస్ జీ దంపతులకు సోని అనే18నెలల బాలిక ఉంది. శనివారం ఉదయం తల్లి తండ్రులు ఇంట్లో ఉండగా ఇంటి ఆవరణలో చిన్నారి సోని ఆడుకుంటూ కుళాయి వద్ద ఉన్న నీటి బకెట్లో పడి మృతి చెందింది. ఆచూకీ కోసం వెతికన తల్లిదండ్రులకు చిన్నారి బకెట్లో విగతజీవిగా కనిపించింది.
విషయం తెలిసిన బంధువులు కుటుంబీకులు బోరున విలపించారు. కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి మృతి చెందాడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.