అంబర్పేట : ప్రముఖ స్వాంతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆయన స్ఫూర్తి, ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని చెప్పారు. హిమాయత్నగర్ మండల కార్యాలయంలో సోమవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, అతిథులుగా కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్, వై.అమృత, కన్నె ఉమాదేవిలు హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాది అంబర్పేట నియోజకవర్గంలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.