మియాపూర్ : నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కాలనీలన్నింటినీ సమాన దృష్టితో చూస్తూ వాటి పురోగతికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్ కాలనీకి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రతినిధులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మంగళవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్బంగా విప్ మాట్లాడుతూ కాలనీలో రహదారులు, తాగునీరు, విద్యుత్, డైనేజీ, వరద కాలువలు సహా ఇతర అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని, ఇప్పటికే కాలనీలో పలు పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధి లో ప్రజలను భాగస్వాములు చేస్తూ నూతన కార్యవర్గం ముందుకు సాగాలని, ఎటువంటి అవసరం ఉన్నా తను అండగా నిలుస్తానన్నారు.
మయూరీనగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని విప్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నారాయణరావు, ఉపాధ్యక్షులు వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామరాజు , స్థానిక నేతలు ,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.