బంజారాహిల్స్ : మొబైల్ షాపులో సెల్ఫోన్ చోరీ చేచిన సూడాన్ దేశస్థుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సూడాన్ దేశస్థుడు మహ్మద్ అబ్దుల్ రాజెగ్ అనే యువకుడు ఈ నెల 4న పారామౌంట్ కాలనీలో నేషనల్ మొబైల్స్ అనే షాపుకు ఫోన్ రిపేరింగ్ చేయించేందుకు వెళ్లాడు.
ఆ సమయంలో షాపులో పనిచేస్తున్న మహ్మద్ ఇమ్రాన్ పనిమీద లోనికి వెళ్లిన సమయంలో కౌంటర్లో ఉన్న వివో వై 12 అనే ఫోన్ను చోరీ చేశాడు. తిరిగి వచ్చిన ఇమ్రాన్ కు ఫోన్ కనిపించకపోవడంతో రిపేర్ కోసం వచ్చిన అబ్దుల్ రాజెగ్ ఫోన్ చోరీ చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.