ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 31 : రైతుల గోస తీరినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ భావిస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ లాంటి అనేక పథకాలు అమలు చేస్తూ, వారి జీవితాల్లో ఆనందం నింపుతున్నారని పేర్కొన్నారు. మండలంలోని మలేబోరిగాంలో శుక్రవారం గిరిజన రైతులకు మేకలు, గొర్రెల యూనిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుల ముఖాల్లో ఆనందం నింపడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూస్తున్నారని చెప్పారు. గిరిజన రైతులకు వ్యవసాయంతో పాటు పశు సంపద అభివృద్ధి కోసం గొర్రెలు, మేకలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సెవ్వ లక్ష్మి, జగదీశ్, అగ్రికల్చర్ ఏడీఏ పుల్లయ్య, మండల వ్యవసాయాధికారి అష్రఫ్, పశువైద్యాధికారి దూద్రాం రాథోడ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొడప సోనేసింగ్, కార్యదర్శి రమణ, సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ సమాజ్ కమ్యూనిటీ హాల్ పనులకు భూమిపూజ..
ఆదిలాబాద్ పట్టణం తిర్పెల్లిలోని బ్రాహ్మణ సమాజ్ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కేటాయించిన రూ.5 లక్షలతో భవన నిర్మాణం చేపట్టినట్లు, ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా నిధులు కేటాయిస్తామన్నారు. అనంతరం అఖిల దేవతా అష్టోత్తర శతనామావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ్ అధ్యక్షుడు అన్నోజుల సంతోష్, కార్యదర్శి లక్ష్మీకాంత్ దండనాయక్, సంజయ్ దేశ్పాండే, హన్మంత్రావ్, అమోల్ దేశ్పాండే, వేద పండితులు మేఘరాజ్ శర్మ, రఘునాథ్, సంతోష్, విలాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
సహకార బ్యాంక్ భవన నిర్మాణానికి..
జైనథ్, డిసెంబర్ 31 : జైనథ్ మండల కేంద్రంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న సహకార బ్యాంక్ భవన నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ రఘునందన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. వీటి ద్వారా రైతులకు ఎన్నో రకాల సేవలు అందుతాయని పేర్కొన్నారు. గతంలో అద్దె భవనాల్లో సేవలు కొనసాగేవని, ఇప్పుడు పక్కా భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ రఘునందన్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారె డ్డి, సీఈవో శ్రీధర్రెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్దన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్దన్రెడ్డి, పురుషోత్తం యాదవ్, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, మేనేజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.