శేరిలింగంపల్లి : మట్టి వినాయకులను పూజిద్ధాం….పర్యావరణాన్ని కాపాడుదామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి డివిజన్ మజీద్బండా, పాపిరెడ్డికాలనీ, రాజీవ్ స్వగృహా, సురభీకాలనీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో బాగంగా మట్టి వినాయకులను పూజించాల్సిన అవసరం ఉంద న్నారు. వివిద రసాయనాలతో కూడిన విగ్రహాలకు స్వస్తిపలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు రవియాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, పద్యరావు, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.