మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి మూడు సంవత్సరాలు పూర్తి చేసు కున్న సందర్భంగా…మంగళవారం పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహాకులు సి.కృష్ణయాదవ్, తిరుమలవంశీ లు మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు శ్యాంసుంధర్రెడ్డి, సన్ని యాదవ్, ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.