బేగంపేట్ :సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో గురువారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం మండపంలో సౌందర్యుల సత్సాంగ్ గ్రూపు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి చిత్ర పటానికి భక్తులు ప్రత్యేకంగా అభషేకించారు.
ఈ క్రమంలో భాగవతంలోని దేవి నారాయణీయం శ్లోక పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకోసం ఈవో గుత్తా మనోహార్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్వహాకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.