కొండాపూర్ : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారమందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
సోమవారం ఆయన చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని చందానగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ రెడ్డి, జీహెచ్ఎంసీ, వాటర్వర్క్, ఎలక్టికల్ శాఖల అధికారులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ముఖ్యంగా మౌళిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు, మంచినీటి తదితర సమస్యలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై చర్చిస్తూ పనులు చేపట్టేలా చూస్తున్నా మన్నారు.
ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయ న్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, వేముకుంట కాలనీల్లో నెలకొన్న పలు సమస్యలపై స్థానికులతో స్వయంగా మాట్లాడి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఓ వైపు కొవిడ్ మహమ్మారీ విజృంభిస్తున్నప్పటికీ మరోవైపు కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ప్రజా సంక్షేమం, అభివృద్ధిలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సుబ్రమణ్య రాజు, సునీత, ఏఎంఓహెచ్ కార్తిక్, టౌన్ప్లానింగ్ టీపీఎస్ మధు, ఎలక్టికల్ ఏఈ రాజ్కుమార్, సురేందర్, ఎస్ఆర్పీ మహేష్, బాలాజీ, వర్క్ఇన్స్పెక్టర్ హరీష్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణగౌడ్, నాయకులు మిరియాల రాఘవరావు, జనార్ధన్రెడ్డి, వెంకటేశ్, గోపి, నాగరాజు, రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.