ఉస్మానియా యూనివర్సిటీ : నిరుపేదలకు జీవితబీమా ఎంతో మేలు చేస్తుందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. అందుకోసమే ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బడుగు బలహీనవర్గాలకు చేయూతనందించే ఉద్దేశంతో అన్ని రకాల చేతివృత్తులు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు, చిరు వ్యాపారులకు బీమా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
తార్నాక డివిజన్లో బీమా కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు మంగళవారం ఇక్కడికి వచ్చారు. డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్కు చెందిన అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తోందని అన్నారు. పేదలకు బీమా కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, కార్మికశాఖ అధికారులు రమేశ్, మయూరి, టీటీయూసీ, టీఆర్ఎస్ నాయకులు శివకుమార్, నాగేశ్వరరావు, లకా్ష్మారెడ్డి, కాజాపాషా, యాకూబ్ షరీఫ్, శ్రీను, లక్ష్మణ్గౌడ్, జెల్లా బాబు తదితరులు పాల్గొన్నారు.