సైదాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఐదవ వర్ధంతి పురస్కరించుకుని సైదాబాద్ రెడ్డిబస్తీలో ఆయన విగ్రహం వద్ద సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగిరెడ్డి ఆకాల మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్దే లక్ష్యంగా పనిచేసిన ప్రజానాయకుడన్నారు.
సైదాబాద్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. అనంతరం శంకేశ్వరబజారులోని వృద్దాశ్రమంలో వృద్దులకు పండ్లు, బిస్కెట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ధం సునీల్ రెడ్డి, సామ సుందర్ రెడ్డి, పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి, సుభాష్, లక్ష్మన్ సింగ్, సునీత్ పత్తి, సంగీత, శ్రీలత, విశ్వశాంతి, హేమలత, పరమేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.