మెహిదీపట్నం : డ్రైనేజీల మరమ్మత్తులు చేసే జలమండలి సివరేజి సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఓల్డ్మల్లేపల్లిజలమండలి సెక్షన్ ఆధ్వర్యంలో మల్లేపలి ప్రియాగార్డెన్లో సివరేజి సిబ్బంది భద్రతా పక్షోత్సవాలను జీఎం మాణిక్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జాఫర్మెరాజ్హుస్సేన్ భద్రతా పక్షోత్సవాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
భద్రతా ప్రమాణాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో డీజీఎం వికాస్,ఎంఐఎం నాయకులు ఎండీ.మూసా, జాఫర్ఖాన్, ఆరిఫ్ రిజ్వాన్, డాక్టర్ ఖాసీంలు పాల్గొన్నారు.నానల్నగర్లో కాకతీయనగర్ జలమండలి సెక్షన్ ఆధ్వర్యంలో భద్రతాపక్షోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్,జీఎం మాణిక్యం,డీజీఎం శ్రీనివాస్,మేనేజర్ సౌమ్యలు పాల్గొని సివరేజి సిబ్బందికి భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు.