మెహిదీపట్నం: సివరేజి మరమ్మత్తులు చేసే సమయంలో సిబ్బంది భద్రతాప్రమాణాలను పాటించాలని గోల్కొండ డివిజన్ జలమండలి డీజీఎం జవహర్ అలీ అన్నారు. సోమవారం డివిజన్ కార్యాలయం ఆవరణలో భద్రతాపక్షోత్సవాలను డీజీఎం జవహర్ అలీ, మేనేజర్లు సాజిద్, మురళీధర్ రెడ్డి, వెంకటేష్లతో కలిసి సివరేజి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
ఇటీవల మ్యాన్హోల్లు శుభ్రం చేసే సమయంలో సివరేజి సిబ్బంది మృత్యువాత పడుతుండటంతో జలమండలి ఎండీ భద్రతా పక్షోత్సవాలను ఆగస్టు 16 నుంచి 31 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట సిబ్బందికి భద్రతాప్రమాణాలపై అవగాహన కల్పించడం జరిగిందని డీజీఎం జవహర్ అలీ తెలిపారు.