శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్నబంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం… హైదరాబాద్కు చెందిన వేముల శ్రీనివాస్, అమ్రగొండ శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రయాణీకులు కువైట్ నుంచి జె9 1403 విమానంలో శంషాబాద్కు వచ్చారు.
అనుమానంతో వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తనిఖీ చేయగా వారు ధరించిన ప్యాంట్ పాకెట్లలో గుర్తుపట్టకుండా బంగారం దాచి ఉంచారు. అధికారుల తనిఖీలో బంగారం పట్టుబడింది. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం 128.260 గ్రాముల బరువు ఉంది. దాని విలువ రూ . 6,15, 519 లక్షలు ఉంటుందని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.