చాదర్ఘాట్ :సెక్రటేరియేట్లో మసీదు నిర్మాణం పై రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయమని తహరీక్ మస్లిం షబ్బాన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ముష్తాక్ మాలిక్ అన్నారు. సెక్రటేరియట్ మసీదు ల పునఃనిర్మాణం పై ఆజంపురాలోని తహరీక్ ముస్లిం షబ్బాన్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముష్తాక్ మాలిక్ మాట్లాడుతూ సెక్రటేరియట్ మసీదు నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2.90 కోట్లు మంజూరు చేశారని, మొదటి విడతగా రూ.1కోటిని విడుదల చేశారన్నారు.
మసీదు నిర్మాణానికి టెండర్ ఖరారు చేయనున్నారన్నారు. మసీదు శంకుస్థాపన పనులను త్వరగా చేపట్టాలని ఆయన కోరారు. మసీదు పునః నిర్మాణం పై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తున్న చొరవ సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు.