జడ్చర్ల, జనవరి 2 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మం డలం గొల్లపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న గ్రామపంచాయతీ నూత న భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. అలాగే గ్రామపంచాయతీ నిధులు రూ.30 లక్షలతో చేపట్టే సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి సొంత ఖర్చు తో ఎస్సీ కాలనీలో రూ.10లక్షలతో నిర్మించనున్న మినీ ఫంక్షన్హాల్, రూ.2లక్షలతో నిర్మించే బస్షెల్టర్ నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెం దితేనే రాష్ట్రం పురోగతి చెందుతున్న లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పల్లెప్రగతి, హరితహా రం కార్యక్రమాలతో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెరిగిందన్నారు. అలాగే పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలకు కొత్తశోభ వచ్చిందన్నారు. అందరూ ఐక్యంగా ఉండి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
రైతన్న సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
రైతన్న సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు రైతుబీమా, రైతుబంధు తదితర పథకాలను అమలు చేస్తూ రైతుకు అండగా ఉంటుందన్నారు. అలాగే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. అయితే యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని తెలిపారు. కేంద్రం అవలంబిస్తు న్న విధానాలతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒకవైపు ధా న్యం కొనుగోలు చేయమని కేంద్రం చెబుతుంటే.. ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం యాసంగిలో వరిసాగు చేయాలని రైతులను అయోమయానికి గురిచేయడం సరికాదన్నారు. కార్యక్రమాలలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి, మాజీ వైస్ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, సర్పంచులు ఈర్లపల్లి ప్రభాకర్రెడ్డి, వట్టిపల్లి రవీందర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, శా రద, మాజీ సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్, ఇమ్మూ, శంకర్నాయక్, శ్రీనునాయక్, లోకేశ్ ఉన్నారు.
జూట్బ్యాగులు వినియోగించాలి
జడ్చర్లటౌన్, జనవరి 2 : ప్లాస్టిక్ కవర్లను నిషేధించిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ జూట్బ్యాగులను వినియోగించాలని ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి సూచించారు. ఉమెన్స్ డెవలప్మెం ట్ సొసైటీ ఆధ్వర్యంలో తయారు చేసిన జూట్బ్యాగులను ఎమ్మెల్యే ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూట్బ్యాగుల ను వినియోగించాలని చెప్పారు. అదేవిధం గా సావిత్రీబాయి ఫూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభాపురస్కారం అందుకున్న జడ్చర్లవాసి బాలమణిని అభినందించారు. కార్యక్రమంలో గోపాల్గౌడ్, గంగాధర్, గోపి, గోనెల రాధాకృష్ణ పాల్గొన్నారు.
నాణ్యత లోపించకుండా చూడాలి
బాలానగర్, జనవరి 2 : వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని ఈదమ్మగడ్డతండా సమీపంలోని ప్రధానరహదారిపై గోల్డ్న్ ఫిల్లింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బంక్ యజమానులు ఎండీ వహిద్, సలీం ఎమ్మెల్యే, ఎంపీని శాలువాతో సత్కరించారు. అలాగే ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి జన్మదినం సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్ ఆధ్వర్యంలో ఎంపీని ఘనంగా సన్మానించారు.