Letter of Credit
అమీర్పేట్ : నిరుపేదల తక్షణ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సీఎం రిలీఫ్ ఫడ్ ఎంతగానో తోడ్పడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. అమీర్పేట్కు చెందిన సర్దార్ కిరణ్సింగ్ గత కొద్ది నెలలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.
నిమ్స్లో చికిత్స పొందుతున్న కిరణ్సింగ్కు తక్షణమే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరపాల్సి ఉంటుందన్న వైద్యుల సూచనలతో ఆందోళనలో పడ్డ కుటుంబ సభ్యులకు అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి భరోసా కల్పిస్తూ సీఎం రిలీఫ ఫండ్ ద్వారా ఆర్ధికంగా చేయూత అందేలా తనవంతు తోడ్పాటునందించారు.
బాధిత కిరణ్కుమార్ కుటుంబ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిఫారసుతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందే లెటర్ ఆఫ్ క్రెడిట్ కోసం (ఎల్వోసీ) సీఎం కార్యాలయాన్ని అభ్యర్ధించారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ సీఎం కార్యాలయం రూ. 2.50 లక్ష ఎల్వోసీ మంజూరు చేయడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు మంజూరైన ఎల్వోసీని శనివారం మంత్రి తలసాని శనివారం ఉదయం మారేడ్పల్లిలోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.