నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 6 : జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పంటల సాగుకోసం పెట్టుబడి సహాయాన్ని అందజేయడాన్ని హర్షిస్తూ రైతులు సంబురాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో రైతుబంధు వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను కలెక్టర్ నారాయణరెడ్డి సన్మానించారు. రైతుబంధు పథకంతో వ్యవసాయరంగం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, వ్యవసాయాధికారి గోవింద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటేశం, టీఆర్ఎస్ నాయకుడు ఈగ గంగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లిమండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘రైతుబంధు’ అక్షరాల ఆకారంలో కూర్చొని ఆకట్టుకున్నారు. రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీస్ రాజ్పాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, వ్యవసాయాధికారి ప్రవీణ్, హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయులు, నాయకులు సబావత్ శ్రీనివాస్, గోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలం ఘన్పూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు రైతుబంధు అంశంపై ఉపన్యాసం, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. బర్ధిపూర్ సొసైటీ చైర్మన్ రామకృష్ణ, ఘన్పూర్ సొసైటీ డైరెక్టర్ సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్పల్లిలోని విద్యావనరుల కేంద్రంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎంఈవో శ్రీనివాస్, ఏఈవోలు వెంకటేశ్, సుభాష్య, శివకుమార్, భాస్కర్నాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అర్గుల్లోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా రైతులు పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు వేసి రైతువేదికను అలంకరించి సంబురాలు నిర్వహించారు. సర్పంచ్ గోర్త పద్మ, ఏవో దేవిక, ఏఈవో భాస్కర్నాయక్, మహిళారైతులు తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండలం మంచిప్పలో రైతువేదికను అందగా అలంకరించి సంబురాలు నిర్వహించారు. సర్పంచ్ సిద్ధార్థ, రైతులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలం లోలం గ్రామంలోని రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి పులి శ్రీనివాస్, సర్పంచ్ శేఖర్, నరేశ్, ఎంపీటీసీ బాబూరావు, సుధీర్, జలంధర్, రైతులు పాల్గొన్నారు.
సిరికొండ మండల కేంద్రంలోని రైతువేదిక నుంచి తెలంగాణ చౌరస్తా వరకు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై కేసీఆర్, జై రైతుబంధు నినాదాలు మార్మోగాయి. రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ మలావత్ మంజుల, సర్పంచులు ఎన్నం రాజిరెడ్డి, పోడెండ్ల రమేశ్, కన్క శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
వర్ని మండల కేంద్రంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, స్పీకర్ శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం రైతువేదిక ఆవరణలో ఫెన్సింగ్ ఏర్పాటు పనులకు భూమి పూజ చేశారు. వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మీవీర్రాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, కో-ఆప్షన్ సభ్యుడు కరీం, వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు వెలగపూడి గోపా ల్, సహకార సొసైటీ చైర్మన్లు నామాల సాయిబా బా, కృష్ణారెడ్డి, నాయకులు కల్లాలి గిరి, మండల వ్యవసాయాధికారి నగేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోస్రా మండలం గోవూర్ సహకార సొసైటీ ఆవరణలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ గుప్త భాస్కర్రెడ్డి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు పథకం రైతులకు అండగా నిలుస్తున్నదన్నారు. సొసైటీ చైర్మన్ సుధాకర్రెడ్డి, వైస్ చైర్మన్ రాంరెడ్డి, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ పిట్ల ఉమా శ్రీరాములు, ఎంపీటీసీ కత్తి శంకర్, సర్పంచ్ నరేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, సాయాగౌడ్, రైతులు పాల్గొన్నారు.
రుద్రూర్ మండలం చిక్కడ్పల్లిలో, చందూర్ మండలం లక్ష్మాపూర్లో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. పోచారం సురేందర్రెడ్డితోపాటు రుద్రూర్ జడ్పీటీసీ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ తోట సంగయ్య, హన్మంతు, సంజీవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, మోహన్, మస్తాన్, లాల్మహ్మద్, మక్కయ్య, లక్ష్మాపూర్ సర్పంచ్ బొడ్డోళ్ల్ల సత్యనారాయణ, రాములు, పెద్ద నర్సింహులు, చింతం శ్రీను, చింతం సాయిలు రైతులు తదితరులు పాల్గొన్నారు.