బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే నిర్మించిన షెడ్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువుకు ఎన్బీటీనగర్ కమాన్లో సుమారు 600గజాల స్థలం ఉంది.
ఈ స్థలంపై గతంలో సుప్రీంకోర్టులో వివాదం ఉండడంతో క్రమబద్దీకరణ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది.కాగా రెండేళ్ల క్రితం ఈ స్థలం ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టులో తీర్పువచ్చింది. అయితే ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో తాజాగా విడుదల అయిన జీవో 59 కింద క్రమబద్దీకరణ చేసుకోవడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో రెండ్రోజుల క్రితం రాత్రికి రాత్రే షెడ్డును నిర్మించారు.
ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందుకున్న షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఉదయం అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.