చిక్కడపల్లి : గాంధీనగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ పారిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ రాజకీయలను, పరిపాలనను మిళితం చేయకుండా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, శ్రీకాంత్,మారిశెట్టి నర్సింగ్ రావు, ఎరం శ్రీనివాస్ గుప్తా,గడ్డమీది శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
బాగ్లింగంపల్లిలో..
బాగ్లింగంపల్లి చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటకృష్ణ (బబ్లు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించి మాట్లాడారు. సుందరయ్య పార్కు వద్ద ఆర్.జయదేవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.వివేక్, శివకుమార్ యాదవ్, పాలమూరు అసోసియేషన్ నాయకుడు వెంకట్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.