ముషీరాబాద్ : ముషీరాబాద్ చేపల మార్కెట్లో విరిగిన మ్యాన్హోల్స్కు జలమండలి అధికారులు గురువారం మరమ్మతులు చేపట్టారు. గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేపల మార్కెట్లో పర్యటించి మ్యాన్హోల్స్ తీరును చూసి జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తవి ఏర్పాటు చేసిన మూన్నాళ్లకే విరిగిపోవడం, మ్యాన్హోల్ మూతలు ప్రమాదకరంగా ఉండటాన్ని చూసిన ఎమ్మెల్యే నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం పట్ల అధికారులపై మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేయడంతోపాటు అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని, తాను మళ్లీ వచ్చి చూస్తానంటూ ఆదేశించారు. దీంతో జలమండలి అధికారులు వెంటనే రంగంలోకి దిగి విరిగిన మ్యాన్హోల్స్కు మరమ్మత్తు పనులు మొదలు పెట్టారు.