శంషాబాద్ రూరల్ : భూమి లీజు విషయంలో దాడి చేసిన మగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించినట్లు సీఐ విజయ్కుమార్ తెలిపారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శంషాబాద్ పట్టణంలోని కాపుగడ్డకు చెందిన శివనాందరెడ్డి నగరానికి చెందిన వ్యక్తులకు భూమి లీజుకు ఇచ్చారు.
అయితే లీజు సమయం ముగిసిన సదరు వ్యక్తులు భూమిని వదలడం లేదు. దీంతో భూమి ఖాళీ చేయించడానికి అక్కడికి వెళ్లగా నగరానికి చెందిన కొంతమంది ఆయుధాలతో సదరు భూమి యజమానిపై దాడి చేసి గాయపరిచారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.