తెలుగుయూనివర్సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల శాఖలో ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మలివిడత సాంస్కృతిక ఉద్యమం (ధూంధాం) పాత్ర అనే అంశంపై మానకొండూరు శాసన సభ్యులు రసమయి బాలకిషన్ పరిశోధన చేసినందుకు డాక్టరేట్ను వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సిహెచ్ మరళీకృష్ణ నోటిపికేషన్ విడుదల చేశారు.
2014-15 విద్యాసంవత్సరంలో పిహెచ్డి కోర్సులో చేరిన రసమయి బాలకిషన్కు ఇటీవలనే వైవాను నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. మంగళవారం విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడు కిషన్రావు ఫీహెచ్డి పూర్తయిన దృవీకరణ పత్రాన్ని రసమయి బాలకిషన్కు అందజేశారు.
బాలకిషన్ గతంలో జానపద కళల శాఖనుండి బి.ఏ, ఎం.ఏ పూర్తి చేయడంతో పాటు పలు ప్రామాణికమైన సాహిత్య పత్రికలలో జానపద అంశాలపై, కళారూపాలపై పలు వ్యాసాలు రాశారు. రసమయి బాలకిషన్ తెలుగువర్సిటీ పూర్వ విద్యార్థిగా ఉండడం హర్షించదగిన విషయమని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ అన్నారు.