వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ప్రజాసంబంధాల అధికారి (పీఆర్ఓ) వన్నోజ్ సుధాకర్ కు రైతు నేస్తం అవార్డు దక్కింది.ఇటీవల ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ద్వారా అవార్డు అందుకున్నారు. సోమవారం వీసీ ప్రవీణ్రావు ఆయనను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఆయనతోపాటు యూనివర్సిటీ కళాశాల విస్తరణ విభాగంలో పనిచేస్తున్న డా. మధుబాబులను అభినందించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు డా. సుధీర్కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ డా. జగదీశ్వర్, సుధారాణి, సీమ, తదితరులు పాల్గొని వారిని అభినందించారు.