దేవరకద్ర రూరల్, జనవరి 5: రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆర్థికాభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లకు చేరుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రైతు సంబురాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్లో ఉల్లిగడ్డ, కందుల వేలాన్ని పరిశీలించి, రైతులకు నష్టం రాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రాజోళి గ్రామానికి చెందిన పుట్ట కృష్ణయ్య కొద్ది రోజుల కిందట అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. రైతుబీమా పథకం ద్వారా వచ్చిన రూ.5లక్షల చెక్కును నామినీ లక్ష్మికి ఎమ్మెల్యే అందజేశారు. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రైతుబంధు డబ్బులు ఆపకుండా అందజేశామన్నారు. ముఖ్యమంత్రి చొరవతో మండలంలో రూ.170 కోట్లతో 21చెక్డ్యాంలు నిర్మించామని, ఏడాదిపాటు రెండు కిలో మీటర్ల దాకా నీరు నిల్వ ఉందని తద్వారా పరిసర పొలాల్లో భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయన్నారు. రూ.51కోట్లతో పేరూర్ లిఫ్ట్ మంజూరైందని త్వరలో పనులు ప్రారంభిచనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గోపన్పల్లి గ్రామంలో బోయ శేషు, మహేశ్ స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా పుట్టపల్లి గ్రామంలో అరుణోదయ యువజన సంఘం, కొమురంభీం యువజన సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. పుట్టపల్లి సర్పంచ్ శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయమని ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించారు. పుట్టపల్లి నుంచి రాచాల వరకు 5.4 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. వాల్మీకి భవనం కోసం రూ.5లక్షలు, సీసీరోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని సర్పంచులు క్రికెట్ జట్టుతో కొద్దిసేపు మాట్లాడి, ఎమ్మెల్యే బ్యాటింగ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారిణి సారిక, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా సుగుణ, సింగిల్ విండో అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొండారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ ఈవీ గోపాల్, నాయకులు శ్రీకాంత్యాదవ్, కొండా శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, శేఖర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చు
మూసాపేట(అడ్డాకుల), జనవరి 5: బీజేపీ నాయకులు కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని పొన్నకల్ గ్రామంలోని పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యాంను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులతోపాటు జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ రాధిక, సర్పంచ్ కల్పనా విజయ్కుమార్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహెమూద్ పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే ఆల
మూసాపేట(అడ్డాకుల), జనవరి 5: అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామానికి చెందిన కారెడ్డి దేవేందర్రెడ్డి తండ్రి కారెడ్డి నారాయణరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విషయాన్ని గ్రామస్తులు జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సీఎం సహాయనిధికి రెఫర్ చేయగా, రూ.3లక్షల ఎల్వోసీ మంజూరైంది. ఈమేరకు హైదరాబాద్లో బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఎల్వోసీని అందజేశారు.