మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడానికి అధికారులు నిస్వార్థంగా కృషి చేయాలని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు.
టోలిచౌకి డివిజన్ ఎండీలైన్స్కు చెందిన సయ్యద్ అషిక్ అలీ ఫాజిల్కు మంజూరైన 60 వేల రూపాయల చెక్ను ఆదివారం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ లబ్దిదారుడికి అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి మహ్మద్ హరూన్ ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు.