బంజారాహిల్స్ : మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న ప్రకాష్రాజ్తో పాటు అతడి ప్యానల్కు సంబంధించిన పలువురు సభ్యులు సోమవారం పోలింగ్ నిర్వహించిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్దకు వచ్చారు. ఎన్నికల రోజున సీసీ ఫుటేజీలను తమకు చూపించాలంటూ కోరారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసుల సమక్షంలో సుమారు గంటన్నర పాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
ఎన్నికల రోజున జరిగిన వాగ్వాదాలతో పాటు కౌంటింగ్ సమయంలో జరిగిన ఘటనలపై తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వచ్చామని ప్రకాష్రాజ్ తెలిపారు. పోలింగ్ మరుసటి రోజునే ఎన్నికల అధికారి కృష్ణమోహన్ను సీసీ ఫుటేజీ ఇవ్వాలని కోరామని, అయితే ఆయన నిరాకరించడంతో పోలీసుల సమక్షంలో ఫుటేజీని పరిశీలించామని ప్రకాష్ రాజ్ తెలిపారు. డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డిల సమక్షంలో ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్రాజ్, శ్రీకాంత్ తదితరులు వెళ్లిపోయారు.