బండ్లగూడ : క్రీడాకారులు బస్తీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదుగలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్లోని నవజ్యోతియూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిసాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విచ్చేసి గెలుపొందిన వారికి నగదు, మెడల్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తప్పు దారి పడకుండా క్రీడాల వైపు దృష్టి మరలించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ గంగధర్, ఇన్స్పెక్టర్ కనకయ్య, ఈశ్వర్, ధర్మరెడ్డి, మహేశ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.