కాచిగూడ : నిషేధిత గంజాయిను అమ్ముతున్న వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం బాగ్లింగంపల్లి ప్రాంతానికి చెందిన గంగాధార్ (40), నేపాల్ రాజు(28)లు గత కొన్ని రోజులుగా నగరంలోని సలు ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు బుధవారం రాత్రి బాగ్లింగంపల్లి ప్రాంతంలో గంగాధార్, నేపాల్ రాజును అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని గురువారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.