చార్మినార్ : యువతను మత్తుకు బానిసగా మారుస్తూ సమాజంలో యువత నిర్వీర్యమయ్యే విధంగా వ్యవహరిస్తున్న గంజాయి విక్రేతపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ను ప్రయోగించారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్థుల్ రవూఫ్ (30) గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నాడు.
పలుమార్లు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినా తన వ్యాపకాన్ని మార్చుకోకుండా అక్రమ సంపాదనకు అలవాటుపడి గంజాయి విక్రయాలు సాగిస్తున్నాడు. దక్షిణ మండల టాస్క్పోర్స్ పోలీసుల సిఫార్సు మేరకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నిందితునిపై పీడీ యాక్ట్ను ప్రయోగించారని తెలిపారు.
గంజాయి విక్రేతలు తమ వ్యాపకాలకు ముగింపు పలికి సుస్థిర సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర సూచించారు. గంజాయి క్రయ, విక్రయాలు సాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.