ముషీరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ను శుక్రవారం రాష్ట్ర ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు కలిశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్లో కలిసిన వారు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అద్దె బస్సుల యజమానులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సజ్జనార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు బస్సు యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. ఆయనను కలిసిన వారిలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర్రావు, గ్రేటర్ అధ్యక్షుడు మైపాల్రెడ్డి, మధుకర్రెడ్డి, నవీన్రెడ్డి, ప్రదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.