15 నుంచి ఎంబీఏ మూడో సెమిస్టర్ తరగతులు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ మూడో సెమిస్టర్ తరగతులను ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. వర్సిటీ పరిధిలోని అన్ని ఎంబీఏ కళాశాలలు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
వివిధ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్, పీజీ డిప్లొమా ఇన్ జాగ్రఫికల్ కార్టోగ్రఫీ కోర్సుల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 15 వరకు, రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు.
మూడేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్, ఐదేళ్ల బీకామ్ఎల్ఎల్బీ రెండు, అయిదో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్, ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ రెండు, అయిదు, ఏడు, తొమ్మిదో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫీజును ఈ నెల 27 లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని పేర్కొన్నారు.
రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 4 వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించ నున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
బీసీఏ రివాల్యుయేషన్కు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ (సీబీసీఎస్) మొదటి, నాలుగో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, రెండు, మూడు, అయిదో సెమిస్టర్ బ్యాక్లాగ్, బీసీఏ (నాన్ సీబీసీఎస్) మొదటి, రెండు, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్, రెండోసంవత్సరం రెండోసెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు.
అభ్యర్థులు తమ మార్కు మెమోలను సంబంధిత కళాశాల నుంచి మూడు వారాల తరువాత పొందవచ్చని పేర్కొన్నారు. రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోదలిచిన వారు ఒక్కో పేపర్కు రూ.500 చొప్పున చెల్లించి ఈ నెల 16 లోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జవాబు పత్రం నకలు పొందగోరేవారు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 16 లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జా మినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 22వ నుంచి, ఎంసీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 26 నుంచి నిర్వహించనున్నారు.
బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 26 నుంచి, ఎంఫార్మసీ (పీసీఐ) రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, మొదటి, మూడో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను ఈ నెల 30 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.