ఆర్కేపురం : క్రీడల్లో రాణింపుతో రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం లభిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ సబ్ జూనియర్ బాలుర నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. 25 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హైదరాబాద్కు వచ్చే విధంగా కృషి చేసిన అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. క్రీడల పరంగా క్రీడాకారులకు సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ టూరిజం కల్చరర్ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు, శ్యాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, హ్యాండ్బాల్ ఫేడరేషన్ అధ్యక్షులు జగన్ మోహన్రావు, ఆనందిశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు.