కొండాపూర్ : శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగుతుంది. సోమవారం డివిజన్ పరిధిలోని ప్రేమ్నగర్ బీ బ్లాక్ కాలనీలో 400మందికి పైగా కాలనీవాసులు వ్యాక్సిన్లువేయించుకున్నారు. కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్కిల్ ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి తెలిపారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్లను సద్వినియోగం చేసుకోవాలని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ చేయించుకోవాలని తెలిపారు. కరోనా మహమ్మారీ నుంచి రక్షణ కవచంగా వ్యాక్సిన్ నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ను అందించేలా డ్రైవ్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సహకారాలతో వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
మియాపూర్ డివిజన్లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వాక్సినేషన్ సెంటర్లో పలువురు కాలనీ వాసులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను జీహెచ్ఎంసి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సందర్శించారు.