కొండాపూర్ : రిటైర్డ్ ఐపీఎస్ రమేష్కుమార్ తల్లిదండ్రులపై నమోదైన ఓ కేసుకు సంబంధించి బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కొండాపూర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. 2018లో రమేష్ సోదరుడి భార్య సంధ్య పట మట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన గృహ హింస కేసులో భాగంగానే ఆయన తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు అందజేశారు.
ఈ విషయంపై పోలీసులు ఇదివరకే ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో కొండాపూర్లోని రమేష్ ఇంటికి నేరుగా విచ్చేసి అందజేశారు. కేసుకు సంబంధించిన పురోగతి నిమిత్తం విచారణకు హాజరవ్వాల్సిందిగా వారికి తెలియజేశారు. విచారణలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాంగ్మూలాలను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.