ఖలీల్వాడి/ నిజామాబాద్ రూరల్/ బాన్సువాడ/ నిజాంసాగర్, డిసెంబర్ 24 : నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఆమె శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్రావు, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలితను పలువురు ప్రముఖులు హైదరాబాద్లో శుక్రవారం కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, టీఆర్ఎస్ రైతువిభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి తదితరులు ఉన్నారు.