వనస్థలిపురం : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల కుంట ఇంజనీర్స్ కాలనీలోని శ్రీనిలయం అపార్ట్మెంట్లో ఎన్ఐఏ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహిస్తున్న ఇళ్లు టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవిచందర్దిగా తెలుస్తోంది.
కాగా అధికారులు వెళ్లినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడం, తాళం వేసి ఉండడంతో తలుపులు పగలగొట్టి సోదాలు నిర్వహించారు. జార్కండ్ రాష్ట్రం నుంచి వచ్చిన ముగ్గురు ఎన్ఐఏ అధికారులు, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఏమీ దొరికాయన్న విషయాన్ని వెల్లడించలేదు.