సికింద్రాబాద్ : నేతాజీ సుభాష్చంద్రబోస్ ఆశయ సాధనకు యువత కృషిచేయాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్య క్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు.
ఆదివారం నేతాజీ జయంతి సందర్భంగా న్యూ బోయిన్పల్లి నేతాజీనగర్లోని సుభాష్చంద్రబోస్ విగ్రహం వద్ద బోర్డు మాజీ సభ్యులతో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదే విధంగా బౌద్ధనగర్ డివిజన్వారాసిగూడ చౌరస్తాలో నేతాజీ విగ్రహానికి కార్పొరేటర్ కంది శైలజ పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమాల్లో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథ్, శ్యామ్కుమార్, ప్రభాకర్, నళినికిరణ్తో పాటు నేతలు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, నర్సింగ్రావు, రమేశ్, అనిల్కుమార్, సుదర్శన్, నాగరాజ్, సబిత, మీనాభాస్కర్, సరళ, ఇక్బాల్, అరీఫ్, ఆశ్వక్, సమీర్తో పాటు కంది నారాయణ, రాజేశ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.