బంజారాహిల్స్ : ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భుజం నొప్పితో బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చేరగా ఆయనకు సర్జరీ నిర్వహించారు. గత ఆరునెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలకృష్ణ ఇటీవల ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఆన్స్టాపబుల్ ఎన్బీకే అనే టాక్షో షూటింగ్లో పాల్గొంటున్నారు.
మూడురోజుల క్రితం షూటింగ్ ముగించుకున్న బాలకృష్ణ కు ఎడమ భుజంలో తీవ్రమైన నొప్పి రాగా కేర్ ఆస్పత్రి వైద్యులు డా. రఘువీర్రెడ్డి, డా.బీఎన్. ప్రసాద్లను సంప్రదించారు. వైద్యులు బాలకృష్ణకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయగా కండరాల్లో చీలిక ఏర్పడిందని గుర్తించారు.
దీంతో కేర్ ఆస్పత్రిలో సోమవారం బాలకృష్ణకు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఒకటి రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.