సుల్తాన్బజార్ : భర్తతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిన ఓ వివాహితను తీసుకువచ్చి భర్తకు అప్పగించిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్.ఐ సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం రెడ్హిల్స్ బజార్ఘాట్కు చెందిన లత (28), పి మధులు భార్యాభర్తలు.
కాగా అక్టోబర్ 22న భర్తతో జరిగిన చిన్న గొడవతో లత ఇంట్లో నుండి వెళ్ళి పోయింది. దీంతో భర్త మధు అదే రోజు నాంపల్లి పోలీస్ స్టేషన్లో భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు న మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కాల్ డేటాను ట్రేస్ చేసి లత తన స్నేహితురాలి వద్ద ఉన్న ట్లు గుర్తించారు.
నాంపల్లి ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా సూచనల మేరకు కానిస్టేబుల్ ఏఆర్ శ్రీకాంత్, మహిళా కానిస్టేబుల్ తేజస్వినిలు మంగళవారం నగరం నుండి క్రిష్ణా జిల్లా మువ్వ మండలం, ఖాజా గ్రామంలోని కూచిపూడి పోలీస్ స్టేషన్ పోలీసుల సహాయంతో లతను నగరానికి తీసుకువచ్చి భర్త మధుకు అప్పగించారు.
మిస్సింగ్ అయిన పది రోజులలోనే ట్రేస్ చేసి అదృశ్యమైన మహిళను భర్తకు అప్పగించేందుకు కృషి చే సిన ఎస్ఐ సుధీర్ను, కానిస్టేబుళ్ళను ప్రత్యేకంగా అభినందించారు.