ఘట్కేసర్, ఆగస్టు: మున్సిపాలిటీ ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మున్సిపాలిటీ సాధారణ నిధులు 5లక్షల,50 వేల రూపాయలతో సిసి రోడ్డు పనులు,15 వార్డులలో11 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి పైప్లైన్ పనులను ప్రారంబించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ, మున్సిపాలిటీ అన్ని వార్డులలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని అన్నారు. స్థానిక ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాలను కల్పించడంలో మున్సిపాలిటీ ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటుందని అన్నారు. మున్సిపాలిటీలో ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నిర్వహిస్తుందని చైర్మన్ కొండల్రెడ్డి వివరించారు.
స్థానికంగా రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, మురుగునీటి పారుదల కాలువల నిర్మాణం, మొక్కలు నాటడడం, పచ్చదనం, పరిశుభ్రత వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్, కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు బి.హరిప్రసాద్రావు, సాయిరెడ్డి, రాజశేఖర్, సరిత,రవి, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.