హయత్నగర్ : హయత్నగర్ డివిజన్ పరిధిలోని ఆయా కాలనీల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని రాజప్పనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరినీ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండేలా చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజప్పనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దీపావళి శ్రావణ్కుమార్, కాలనీవాసులు భాగ్యనాయక్, చంద్రప్ప, హరినాథ్బాబు, ప్రభాకర్, గుండ్రాతి సాయినాథ్గౌడ్, రాంచంద్రా రెడ్డి, శేఖర్రెడ్డి, సోలంకి సునీల్, టీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్, ఎల్బీనగర్ నియోజక వర్గం నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.