బొల్లారం : ఇంటి నుండి బయటికి వెళ్లి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం..తిరుమలగిరి శాస్త్రీనగర్ కు చెందిన మంజుల క్రిష్ణ జనార్థన్ భార్యభర్తలు వీరికి ఇద్దరు కుమార్తెలు. ఈనెల 7న ఆర్థిక ఇబ్బందుల విషయమై భార్యభర్తలు ఇద్దరు గొడవపడ్డారు.
8న భర్త తన పనుల నిమిత్తం బయటికి వెళ్లాడు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి భార్య ఇంట్లో కనపడలేదు. బంధువులను, కుటుంబ సభ్యులను విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం భర్త క్రిష్ణ జనార్థన్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.